తెలంగాణ సెట్ పరీక్ష రీషెడ్యూల్..

తెలంగాణ సెట్ పరీక్ష రీషెడ్యూల్ ఖరారు చేసింది. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల తరుణంలో మార్చి 13న జరగాల్సిన పరీక్ష వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది. అయితే 14, 15వ తేదీల్లో జరగాల్సిన టీఎస్‌ సెట్‌ పరీక్షలు యథావిధిగా జరుగుతాయని సెట్‌ సభ్య కార్యదర్శి ఆచార్య మరళీకఅష్ణ స్పష్టం చేశారు. అదే విధంగా వాయిదా వేసిన పరీక్షకు మార్చి 17వ తేదీన నిర్వహించనున్నట్లు తెలిపారు.

సెట్‌ పరీక్ష కోసం దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు ఈ నెల 10 వ తేదీ నుంచి హాల్‌ టికెట్లను డౌన్‌ లోడ్‌ చేసుకోవచ్చని ఓయూ పౌర సంబంధాల అధికారి పేరిట ఒక ప్రకటన వెలువడింది. ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం టీఎస్ సెట్ ఈనెల 13వ తేదీ నుంచి మూడు రోజుల పాటు జరగాల్సి ఉంది. అయితే, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో 13న జరగాల్సిన పరీక్షను వాయిదా వేసింది.