తెలంగాణ పాలిసెట్ ఫలితాలు విడుదల
హైదరాబాద్ః తెలంగాణ పాలిసెట్ ఫలితాలు విడుదలయ్యాయి. ఫలితాలను సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ నవీన్ మిట్టల్ విడుదల చేశారు. నాంపల్లిలోని సాంకేతిక విద్యాశాఖ కార్యాలయంలో ఈ ఫలితాలను వెల్లడించారు. పాలిసెట్ ఎగ్జామ్ను జూన్ 30న తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించారు. మొత్తం 1,04,432 మంది విద్యార్థులు ఈ పరీక్ష రాశారు. పాలిటెక్నిక్ డిప్లొమా కోర్సులతో పాటు అగ్రికల్చర్, వెటర్నరీ, హార్టికల్చర్ సీట్లను పాలిసెట్ ర్యాంకుల ఆధారంగా అధికారులు భర్తీ చేయనున్నారు.
తాజా ఏపి వార్తల కోసం క్లిక్ చేయండిః https://www.vaartha.com/andhra-pradesh/