వివేక్కు ఈడీ బిగ్ షాక్..
తెలంగాణ ఎన్నికల సమయంలో ఐటీ రైడ్స్ నేతలను నిద్ర పట్టకుండా చేస్తున్నాయి. ముఖ్యంగా కాంగ్రెస్ నేతల ఇళ్ల ఫై , ఆఫీస్ ల ఫై పెద్ద ఎత్తున దాడులు జరుపుతున్నారు. తాజాగా మాజీ ఎంపీ, మాజీ ఎంపీ, చెన్నూరు కాంగ్రెస్ అభ్యర్ధి వివేక్ ఇళ్లు, కార్యాలయాల్లో ఐటీ అధికారులు తనిఖీలు చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో రంగంలోకి దిగిన ఈడీ.. వివేక్కు చెందిన విశాఖ ఇండస్ట్రీస్ ద్వారా తాజాగా 100కోట్ల నగదు బదిలీ జరిగినట్లు తెలిపింది.
వివేక్కు చెందిన విశాఖ ఇండస్ట్రీస్ లిమిటెడ్ నుంచి విజిలెన్స్ సెక్యూరిటీ సర్వీసెస్ సంస్థకు వెళ్లిన రూ. 8 కోట్లు.. వ్యాపారంలో భాగంగా జరిగిన లావాదేవీ కాదని ఈడీ అధికారులు తెలిపారు. విజిలెన్స్ సెక్యూరిటీ సంస్థ ఫెమా చట్టాన్ని ఉల్లంఘించిందని, వివేక్ కూడా ఈ చట్టాన్ని ఉల్లంఘించినట్టుగా పేర్కొన్న ఈడీ అధికారులు ఆయనపై ఫెమా చట్టం కింద కేసులు నమోదు చేశారు.
ఈడీ అధికారులు మంగళ, బుధవారాల్లో వివేక్కు చెందిన ఇంటితో పాటు విశాఖ ఇండస్ర్టీస్, విజిలెన్స్ సెక్యూరిటీ కార్యాలయాల్లో సోదాలు జరిపారు. వాస్తవానికి విజిలెన్స్ సెక్యూరిటీ సర్వీసెస్ వివేకానంద పరోక్ష నియంత్రణలో నడుస్తున్నట్టు ఈడీ అధికారులు పేర్కొన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో వివేకానంద, ఆయన భార్య, ఆయనకు చెందిన కంపెనీలు విజిలెన్స్ సెక్యూరిటీ సర్వీసెస్తో 100 కోట్ల రూపాయల మేర లావాదేవీలు జరిపినట్టుగా తమ విచారణలో నిర్ధారణ అయ్యిందన్నారు ఈడీ అదికారులు. ఈ లావాదేవీల్లో 20 లక్షల రూపాయల లాభం కూడా వచ్చినట్టు బ్యాలెన్స్ షీట్లో పేర్కొన్నారన్నారు.