యాదాద్రిలో తిరుకల్యాణోత్సవానికి హాజరుకానున్న సీఎం కేసీఆర్‌

నేడు యాదాద్రిలో సీఎం కేసీఆర్ పర్యటన

KCR Warangal District Tour Cancelled
TS CM Kcr

హైదరాబాద్ : నేడు యాదాద్రిలో సీఎం కెసిఆర్ పర్యటించనున్నారు. యాదాద్రి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా 8వ రోజు శ్రీరామ అలంకార సేవలో భక్తులకు లక్ష్మీ నరసింహ స్వామి దర్శనమివ్వనున్నారు. ఉదయం 11 గంటలకు గజవాహన సేవ, తిరుకల్యాణ మహోత్సవం జరుగనున్నాయి. తిరుకల్యాణోత్సవానికి సీఎం కేసీఆర్‌ దంపతులు హాజరుకానున్నారు. ప్రభుత్వం తరఫున పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించనున్నారు. సమర్పించనున్నారు. అలాగే యాదాద్రి ఆలయ బంగారు తాపడం కోసం తమ కుటుంబం తరఫున సీఎం కేసీఆర్ 1.16 కిలోల బంగారాన్ని అందజేయనున్నారు.

మరోవైపు యాదాద్రి ఆలయ పునర్నిర్మాణ పనులు తుది దశకు చేరుకోవడంతో దివ్యక్షేత్రం మహాకుంభ సంప్రోక్షణకు ముస్తాబవుతోంది. మార్చి 21 నుంచి 28వరకు జరిగే కార్యక్రమాల కోసం 75 ఎకరాల్లో ఏర్పాట్లు కొనసాగుతున్నాయి.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి : https://www.vaartha.com/news/national/