అట్టహాసంగా శర్వానంద్ పెళ్లి రిసెప్షన్..

హీరో శర్వానంద్ పెళ్లి రిసెప్షన్ హైదరాబాద్ లో గత రాత్రి అట్టహాసంగా జరిగింది. ఈ వేడుకకు సినీ , రాజకీయ ప్రముఖులు పెద్ద ఎత్తున హాజరై, నూతన వధూవరులను ఆశీర్వదించారు. జైపూర్‌లోని లీలా ప్యాలెస్‌లో కుటుంబసభ్యులు, ఇండస్ట్రీ స్నేహితులు, సన్నిహితుల సమక్షంలో జూన్ 2 , 3 తేదీల్లో జరిగిన శర్వానంద్‌ పెళ్లి వేడుకకు టాలీవుడ్ యాక్టర్లు రాంచరణ్‌, సిద్దార్థ్‌, అదితీరావు హైదరీతోపాటు ఇతర నటీనటులు, సినీ ప్రముఖులు హాజరై.. వధూవరులను ఆశీర్వదించారు. శర్వానంద్‌ సతీమణి రక్షితారెడ్డి సాఫ్ట్‌ వేర్‌ ఉద్యోగిని.

ఈ క్రమంలో శుక్రవారం హైదరాబాద్ లో వీరి రిసెప్షన్ ను గ్రాండ్ గా జరిగింది. ఈ వేడుకకు టాలీవుడ్ తారాలోకం కదిలి వచ్చింది. వెంకటేష్, బాలకృష్ణ, రామ్ చరణ్, నారాయణ మూర్తి, విశ్వక్ సేన్, అల్లరి నరేష్, దర్శకులు క్రిష్, సుజీత్, రాధా కృష్ణ.. నిర్మాత దిల్ రాజు సహా పలువురు టాలీవుడ్ సెలబ్రెటీలు ఈ వేడుకకు హాజరై సందడి చేశారు. అలాగే తెలంగాణ మంత్రి కేటీఆర్ సహా పులువురు రాజకీయ నాయకులు హాజరై సందడి చేశారు. ప్రస్తుతం ఈ వేడుకకు సంబంధించిన ఫోటోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.