ఏలూరు మహాశివరాత్రి ఉత్సవాల్లో విషాదం..

మహాశివరాత్రి ఉత్సవాల్లో విషాదం చోటుచేసుకుంది. గోదావరిలో ముగ్గురు యువకులు గల్లంతయ్యారు. ఈ ఘటన ఏలూరు జిల్లాలోని పోలవరం మండలం పట్టిసీమలో ఈ విషాద ఘటన చోటుచేసుకుంది.

వివరాల్లోకి వెళ్తే..పోలవరం మండలం పట్టిసీమ వద్ద ఉన్న శివాలయాన్ని దర్శించుకునేందుకు ముగ్గురు యువకులు వెళ్లారు. అక్కడ స్నానాలు చేసేందుకు వారు గోదావరి నదిలో దిగారు. ఈ క్రమంలో నది ప్రవాహానికి ముగ్గురు కొట్టుకుపోయారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. అనంతరం గజ ఈతగాళ్ల సహాయంతో గాలింపు చర్యలు చేపట్టారు. గల్లంతైన వారు తూర్పు గోదావరి జిల్లా దోసకాయలపల్లికి చెందిన వారిని గుర్తించారు.

మరోవైపు రెండు తెలుగు రాష్ట్రాల్లో మహాశివరాత్రి వేడుకలు అట్టహాసంగా జరుగుతున్నాయి. ఉదయం నుండి కూడా పెద్ద ఎత్తున భక్తులు , రాజకీయ నేతలు శివయ్యను దర్శించుకొని మొక్కులు తీర్చుకుంటున్నారు. అలాగే భక్తులు ఎలాంటి ఇబ్బందులు పడకుండా ఆలయ అధికారులు ఏర్పాట్లు చేసారు. అలాగే మహాశివరాత్రి సందర్బంగా APSRTC , TSRTC లు ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసారు.