ఓటేయని వారి నుండి డబ్బులు వసూళ్లు చేస్తున్న పార్టీల నేతలు

తెలంగాణ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసాయి. రేపు ఫలితాలు వెల్లడికాబోతున్నాయి. ఈసారి కూడా పెద్ద ఎత్తున పార్టీల నేతలు ఓటర్లకు డబ్బులు పంచారు. ఓటుకు వెయ్యి నుండి నాల్గు వేల వరకు పంచడం జరిగింది. కానీ డబ్బులు తీసుకున్న చాల మంది ఓటు వేయకపోవడం తో అభ్యర్థులు షాక్ అయ్యారు.

ఇదే క్రమంలో ఇప్పుడు డబ్బులు తీసుకొని ఓటు వేయని వారి నుండి తిరిగి డబ్బులు వసూళ్లు చేస్తున్నారు. డబ్బులు తీసుకొని ఓటు వేయని మీరు..మా డబ్బులు మాకు ఇచ్చాయండి అంటూ ఇంటింటికి తిరిగి అడుగుతున్నారు. నేతలు ఇళ్ల ముందుకు వచ్చి డబ్బులు అడగడం తో ఓటర్లు షాక్ అవుతున్నారు.