కూకట్ పల్లిలో అగ్నిప్రమాదం..3 బస్సులు దగ్ధం

three-buses-burnt-in-fire-accident-at-kukatpally

హైదరాబాద్‌ః హైదరాబాద్‌లోని కూకట్‌పల్లిలో పార్కింగ్ చేసిన మూడు బస్సులు దగ్ధమయ్యాయి. కూకట్‌పల్లిలోని ఐడీఎల్ చెరువు వద్ద భారతీ ట్రావెల్స్‌కు చెందిన మూడు బస్సుల్లో అర్ధరాత్రి మంటలు చెలరేగాయి. దీంతో అప్రమత్తమైన సిబ్బంది పక్కనే ఉన్న బస్సులను అక్కడినుంచి తరలించారు.

సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. రెండు ఫైర్‌ఇంజిన్లతో మంటలను అదుపుచేశారు. ఈఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. అగ్నిప్రమాదం ప్రమాదవశాత్తు జరిగిందా? లేదా ఎవరైనా నిప్పుటించారా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.