ఏపీ – తెలంగాణ రాష్ట్రాలు మళ్లీ కలిసే ప్రసక్తే లేదు – చంద్రబాబు

ఏపీ – తెలంగాణ రాష్ట్రాలు మళ్లీ కలిసే ప్రసక్తే లేదని స్పష్టం చేసారు మాజీ ముఖ్యమంత్రి , టీడీపీ అధినేత చంద్రబాబు. ఇటీవల ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల..ఏపీ – తెలంగాణ రాష్ట్రాలు మళ్లీ కలిస్తే బాగుటుందని , ఆ ఆలోచనకు ఆ ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పడం తో రెండు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ అయ్యింది. తెలంగాణాలో పలు పార్టీల నేతలు సజ్జల కామెంట్స్ ఫై ఆగ్రహం వ్యక్తం చేసారు.

తాజాగా ఖమ్మంలో ఏర్పటు చేసిన టీడీపీ భారీ బహిరంగ సభలో పాల్గొన్న చంద్రబాబు..ఏపీ – తెలంగాణ రాష్ట్రాలు మళ్లీ కలిసే ప్రసక్తే లేదన్నారు. ఖమ్మం జిల్లాను తీర్చిదిద్దాం. ఉమ్మడి రాష్ట్రంలో హైదరాబాద్‌లో ఐటీ స్థాపించాం. అప్పట్లో సెల్‌ఫోన్‌ బువ్వ పెడుతుందా అని ఎగతాళి చేశారు. ఇప్పుడు సెల్ ఫోన్ లేకుండా భార్యాభర్తలు కూడా ఉండలేరన్నారు. ఎన్టీఆర్‌ తెలుగుజాతి గౌరవాన్ని నిలబెట్టారు. తెలుగు ప్రజలకు ఆయన ఒక ధైర్యం. ఆయన విగ్రహం ముందు తీసుకున్న ఏ సంకల్పం అయినా నెరవేరుతుంది. తెలుగు వాళ్లు ఎక్కడ ఉన్నా వారి అభివృద్ధి కోసం పనిచేసే పార్టీ టీడీపీ అన్నారు. అది తెలంగాణ అయినా, ఆంధ్రప్రదేశ్‌ అయినా. మీ అభిమానాన్ని గుర్తుంచుకుంటానని చంద్రబాబు తెలిపారు. అలాగే తెలంగాణ – ఏపీ మళ్లీ కలిసే ప్రసక్తి లేదని అన్నారు.