76 ఏళ్ల వయసులో ప్రేమ చిగురించింది..అంతే ఆగకుండా పెళ్లి చేసుకున్నాడు

ప్రేమకు వయసుతో సంబంధం లేదని ఈ ఘటన తో మరోసారి రుజువైంది. 76 ఏళ్ల వృద్ధుడికి ప్రేమ చిగురించింది. ఎనిమిదేళ్లు గా ప్రేమిస్తున్న ఆమెను పెళ్లి చేసుకున్నాడు. ఈ ప్రేమ ఘటన ఒడిశా గంజాం జిల్లాలోని సంఖెముండి మండలం అడ్డాడ గ్రామంలో చోటుచేసుకుంది.

వివరాల్లోకి వెళ్తే..

గ్రామానికి చెందిన రామచంద్ర సాహు (76) అతడికి చాలా ఏళ్ల క్రితం పెళ్లైంది. తన ఇద్దరు కుమార్తెలకు కూడా వివాహం చేశాడు. ఒక కుమార్తె అత్తవారంట్లో ఉండగా.. మరో కుమార్తె చనిపోయింది. అంతకుముందే తన భార్య చనిపోయింది. దాదాపు 18 ఏళ్ల నుంచి ఒంటరిగానే జీవనం సాగిస్తున్నాడు . దీంతో అతడు మళ్లీ పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. ఎనిమిదేళ్ల క్రితం భంజ్‌నగర్‌ ప్రాంతంలోని కులగర్ గ్రామానికి చెందిన త్రినాథ్ సాహు కుమార్తె సురేఖ (46)ను చూశాడు. తొలి చూపులోనే ఆమెపై మనసు పారేసుకుని పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. రామచంద్ర.. వివాహ ప్రతిపాదనకు సురేఖ కూడా అంగీకరించింది. దీంతో ఇద్దరూ కొన్నాళ్ల పాటు ఫోన్​లో మాట్లాడుకున్నారు. చివరకు జులైన 19న భంజ్​నగర్​ కోర్టులో పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత గుడిలో ఆచారాల ప్రకారం మరోసారి వివాహం చేసుకున్నారు. వీరి ప్రేమకు కుటుంబ సభ్యులు అడ్డు చెప్పకుండా ఈ వయసులో తోడు అనేది అవసరమని అన్నారు. ఈ లేటు ప్రేమ పెళ్లి ని చూసేందుకు చుట్టుపక్కల జనాలు పెద్ద ఎత్తున వచ్చారు.