కేంద్రం నిర్ణయాన్నే అమలు చేస్తాం
లాక్డౌన్ పై స్పందించిన యూపీ సిఎం
లక్నో: దేశంలో కరోనా విజృంభణ కొనసాగుతుంది. కరోనా వ్యాప్తి నివారణ కొరకు విధించిన లాక్డౌన్ రేపటితో ముగియనుంది. ఈ నేపథ్యంలో లాక్డౌన్ గడువు పెంచాలని ఇప్పటికే పలు రాష్ట్రాలు కేంద్ర ప్రభుత్వానికి సూచించాయి. అందులో కొన్ని ఈ నెల 30 వరకు లాక్డౌన్ను పొడగించాయి. కాని యూపి ముఖ్యమంత్రి యోగా ఆదిత్యనాధ్ మాత్రం కేంద్రం తీసుకునే నిర్ణయాన్నే రాష్ట్రంలో అమలు చేస్తామని తెలిపారు. ప్రజలు సామాజిక దూరం పాటించేలా ఎలా చేయవచ్చో ఉప ముఖ్యమంత్రి కేశవ్ మౌర్య అధ్యక్షతన నిర్ణయిస్తామని, ఇప్పటికే విద్య, ఆర్దిక, వ్యవసాయ, నీరు, నిర్మాణ తదితర అంశాకు సంబందించి వివిధ కమీటీలను ఏర్పాటు చేసినట్లు సిఎం తెలిపారు.
తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/telangana/