ఏపీకి కేంద్రం మరో తీపి కబురు..

ఏపీకి కేంద్రం వరుస గుడ్ న్యూస్ లు అందిస్తూనే ఉంది. ఇప్పటికే పెద్ద ఎత్తున నిధులను అందజేసిన కేంద్రం..తాజాగా మరో రూ. 900 కోట్లు మంజూరు చేసింది. రాష్ట్రంలో కొత్తగా 9 జాతీయ రహదారుల నిర్మాణానికి కేంద్ర రవాణా, జాతీయ రహదారుల శాఖ ఆమోదం తెలిపింది. వీటికి ఏకంగా రూ.9,009 కోట్లు కేటాయించింది. మొత్తం 411 కిలోమీటర్ల నిడివి ఉన్న ఈ రహదారుల కోసం రాష్ట్ర ప్రభుత్వం పంపిన ప్రతిపాదనలను యథాతథంగా ఆమోదించింది.

రాయలసీమలో పారిశ్రామికాభివృద్ధికి దోహదం చేసేలా రాష్ట్ర ప్రభుత్వం ఈ రహదారులను ప్రతిపాదించింది. పొడవైన తీరప్రాంతం ఉన్న రాష్ట్రాన్ని పోర్టు ఆధారిత పరిశ్రమలతో అభివృద్ధి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. దీని కోసం సీఎం జగన్ రెండుసార్లు కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీతో సమావేశమై జాతీయ రహదారులపై ప్రతిపాదనలను సమర్పించారు. దీనిపై సానుకూలంగా స్పందించిన కేంద్ర ప్రభుత్వం వాటిని ఆమోదించింది. వీటికి కేంద్ర రవాణా, జాతీయ రహదారుల అభివృద్ధి శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ ఈ నెల 28న తిరుపతిలో భూమిపూజ చేయనున్నారు.