రాజగోపాల్‌రెడ్డి ప్రచారంలో ఉద్రిక్తత..

మునుగోడు ఉప ఎన్నిక రాజగోపాల్‌రెడ్డి ప్రచారంలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. గుర్తు తెలియని వ్యక్తుల రాళ్ల దాడుల్లో ఇద్దరు బిజెపి కార్య కర్తలకు గాయాలు అయ్యాయి. ఈ ఘటన భువనగిరి జిల్లా చౌటుప్పల్‌ మండలం ఆరెగూడెంలో చోటుచేసుకుంది. మునుగోడు ఉప ఎన్నిక ప్రచారం నేటితో ముగుస్తుంది. ఈ క్రమంలో పార్టీల నేతలు చివరి రోజున ప్రచారం తో హోరెత్తిస్తున్నారు. కాగా సోమవారం చౌటుప్పల్‌ మండలం ఆరెగూడెంలో ఉద్రికత్త వాతావరణం చోటుచేసుకుంది.

బిజెపి అభ్యర్థి రాజగోపాల్‌రెడ్డి సోమవారం రాత్రి 10 గంటలకు ఆరెగూడెంలో ప్రచారం ముగించారు. అనంతరం కార్యకర్తలతో మాట్లాడుతుండగా గుర్తు తెలియని వ్యక్తులు రాళ్ల దాడి చేశారు. దీంతో ఇద్దరు బీజేపీ నాయకులు గాయపడ్డారు. ఉద్రిక్తతల మధ్య రాజగోపాల్‌రెడ్డి అక్కడి నుంచి వెళ్లిపోయారు. తమపై రాళ్ల దాడి చేసిన వారిని అరెస్ట్‌ చేయాలని గ్రామస్థులు, బీజేపీ కార్యకర్తలు గ్రామ చౌరస్తాలో బైఠాయించారు.