బిఆర్ఎస్ పార్టీ లో భారీగా చేరికలు

Massive additions to the BRS party

ఆదిలాబాద్ : అభివృద్ధి, సంక్షేమ పథకాలే బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు మంచి పేరు తెచ్చి పెడుతున్నాయని అదే ఉత్సాహంతో ప్రజలకు మరింత సేవలు అందించే దిశగా కార్యకర్తలు ముందుకు నడవాలని ఆదిలాబాద్‌ ఎమ్మెల్యే జోగు రామన్న అన్నారు. జైనథ్ మండలంలో ఏర్పాటుచేసిన బిఆర్ఎస్ పార్టీ చేరికల కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే రామన్న పాల్గొన్నారు.

మొదట జైనథ్ బస్టాండు నుంచి చేరికల కార్యక్రమం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం కాంగ్రెస్ పార్టీకి చెందిన ప్రముఖ నాయకులు మాజీ మార్కెట్ చైర్మన్ యాసం నర్సింగ్ రావు, మాజీ మండల ఉపాధ్యక్షుడు అల్లూరి కల్చప్ రెడ్డి, పిఎసిఎస్ మాజీ చైర్మన్ నాగన్న విఠల్‌తో పాటు మాజీ సర్పంచులు నరేందర్ రెడ్డి, మరో 500ల మంది కార్యకర్తలు బిఆర్ఎస్ పార్టీలో చేరారు. వారందరికీ బిఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే జోగు రామన్న గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.