జూబ్లీహిల్స్ అంబేద్కర్ కాలనీలో ఉద్రిక్తత ..

జూబ్లీహిల్స్ అంబేద్కర్ కాలనీలో ఉద్రిక్తత నెలకొంది. కాలనీ లో పేదల గుడిసెలను జీహెచ్ఎంసీ, రెవెన్యూ అధికారులు కూల్చేస్తుండడంతో స్థానికులు తిరగబడ్డారు. తమ గుడిసెలను కూల్చివేయవద్దు అంటూ బ్రతిమాలాడుతున్న పట్టించుకోకపోవడంతో ఆందోళనకారుల ఆగ్రహం కట్టలు తెంచుకుంది. కూల్చివేతను అడ్డుకునే ప్రయత్నం చేయగా.. పెద్ద సంఖ్యలో వచ్చిన పోలీసులు ఆందోళనకారులను అరెస్ట్ చేసి స్టేషన్ కు తరలించారు.

తమ గుడిసెలను తొలగిస్తే తాము ఎక్కడుండాలని ఆందోళనకారులు ప్రశ్నించారు. గత 35 ఏళ్లుగా.. ఒక తరానికి పైగా ఇక్కడే గుడిసెలు వేసుకుని నివసిస్తున్నామని, ఎన్నికల సమయాల్లో తమకు ఇండ్ల పట్టాలు ఇస్తామని హామీ ఇచ్చారన్నారని వారు గుర్తు చేశారు. ఇప్పుడు డబుల్ బెడ్ రూం ఇండ్లు ఇస్తామని మాయ మాటలు చెప్పి స్థలాన్ని కబ్జా చేయాలని చూస్తున్నారని వారంతా వాపోయారు. తమను నిస్సహాయులుగా మార్చి రోడ్డున పడేస్తారా వారంతా కంటతడిపెట్టుకుంటున్నారు.