తెలంగాణ కొత్త సిఎస్ గా శాంతి కుమారి

తెలంగాణ కొత్త సిఎస్ గా శాంతి కుమారి నియమితులయ్యారు. ప్రస్తుతం ఉన్న సోమేశ్ కుమార్ ను వెంటనే ఏపీకి వెళ్లాలని హైకోర్టు సూచించింది. క్యాట్ ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను హైకోర్టు కొట్టేసింది. దీంతో.. కేంద్ర ప్రభుత్వం స్పందించి తెలంగాణ నుంచి సోమేష్ కుమార్‌ను రిలీవ్ చేస్తూ.. ఏపీకి కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

ఈ క్రమంలో తెలంగాణ సిఎస్ గా శాంతి కుమారి ని నియమిస్తున్నట్లు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇక కొత్త సీఎస్ స్థానంలో పలువురు పేర్లు ప్రచారం జరిగాయి. వారిలో అరవింద్ కుమార్,రామకృష్ణారావు పేర్లు వచ్చాయి. వారితో పాటు శాంతి కుమారి, వసుధా మిశ్రా,శశాంక్ గోయల్, సునీల్ శర్మ, రజత్ కుమార్ వంటిపేర్లు వచ్చాయి.కానీ ఫైనల్ గా మాత్రం ప్రభుత్వం శాంతి కుమారి పేరును ఖరారు చేసింది.

ఇక సోమేశ్ కుమార్ రేపు ఏపీ ప్రభుత్వానికి రిపోర్ట్ చేయబోతున్నారు. డిఓపిటి ఆదేశాల మేరకు ఏపీ ప్రభుత్వానికి రిపోర్ట్ చేయనున్నారు.