మరోసారి కాపుల ఫై వర్మ ట్వీట్

వివాదాలకు కేరాఫ్ గా నిలిచే రామ్ గోపాల్ వర్మ..ప్రస్తుతం కాపుల ఫై వరుస ట్వీట్స్ చేస్తూ వార్తల్లో నిలుస్తున్నారు. రీసెంట్ గా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ – టీడీపీ అధినేత చంద్రబాబు భేటీ కావడం తో ఏపీలో రాజకీయాలు మరింత వేడెక్కాయి. వీరిద్దరి భేటీ ఫై వైస్సార్సీపీ నేతలే కాదు డైరెక్టర్ వర్మ సైతం పలు విమర్శలు చేస్తూ కాపులకు ఆగ్రహం తెప్పిస్తున్నారు. ‘RIP కాపులు , కంగ్రాట్యులేషన్స్ కమ్మోళ్లు’ అంటూ ట్వీట్ చేసి వారిలో ఆగ్రహం తెప్పించిన వర్మ..తాజాగా మరో ట్వీట్ చేసాడు. ‘కాపులు – కాపులు x కాపులు + కమ్మోళ్ళు ÷ సేనలు – సేనలు ఇస్ నాట్ = ఓట్లు’ అంటూ మరోసారి టార్గెట్ చేశారు.

ఇప్పటికే కాపు నేతలు వర్మ కు హెచ్చరికలు జారీ చేసినప్పటికీ , ఆ హెచ్చరికలను ఏమాత్రం పట్టించుకోకుండా వర్మ అలాగే ట్వీట్స్ చేస్తున్నారు. వర్మ ట్వీట్ వెనుక వైస్సార్సీపీ హస్తం ఉందని కాపు సంఘాలు ఆరోపిస్తున్నారు. కాపు మంత్రులంతా.. జాతిని ముఖ్యమంత్రి జగన్‌కు తాకట్టు పెట్టారని.. కాపులపై కుట్రలో భాగంగానే రామ్‌గోపాల్‌వర్మ ఈ వ్యాఖ్యలు చేశారన్నారు. వర్మ ప్యాకేజీ కోసం కాపులపై కామెంట్లు చేస్తే చెప్పు తీసుకుని కొడతామని హెచ్చరించారు. కాపులను రాజకీయ కారణాలు పేరు చెప్పి విభజించాలనే కుట్ర జరుగుతుందన్నారు. విద్వేషాలు రెచ్చగొట్టాలని వైస్సార్సీపీ నేతలు వర్మ లాంటి ఊర కుక్కలను వదలుతున్నారు. మెగా ఫ్యాన్స్ సైతం స్ట్రాంగ్ కౌంటర్ ఇస్తున్నారు. వర్మ ఒళ్లు దగ్గరపెట్టుకోవాలని హెచ్చరిస్తున్నారు.