మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్, బిజెపి అడ్రస్ గల్లంతు
సహకార సంఘం ఎన్నికల్లో ఏకగ్రీవం కోసం నాయకులు కృషి చేయాలి
సూర్యాపేట: మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్, బిజెపి అడ్రస్ గల్లంతు అయ్యిందని మంత్రి జగదీశ్ రెడ్డి అన్నారు. మంగళవారం సూర్యాపేట క్యాంపు కార్యలయంలో సూర్యాపేట నియోజకవర్గ స్థాయి కార్యకర్తలతో మంత్రి సమావేశం నిర్వహించారు. సహకార ఎన్నికల్లో అవలంబించాల్సిన కార్యచరణపై కార్యకర్తలకు జగదీష్ రెడ్డి దిశా నిర్దేశం చేశారు. సహకార సంఘం ఎన్నికల్లో ఏకగ్రీవం కోసం నాయకులు కృషి చేయాలని జగదీష్ రెడ్డి పిలుపునిచ్చారు. దేశ రాజకీయ చరిత్రలో టిఆర్ఎస్ పార్టీ సృషించిన రికార్డులను ఎవరూ బ్రేక్ చేయలేరని అన్నారు. కులం అనేది ఆధారం కావాలి తప్పా వ్యతిరేకం కాకూడదన్నారు. హద్దు మీరితే ఎంతటి వారిపైనా చర్యలు తప్పవన్నారు. ప్రపంచ దేశాలు తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పధకాల వైపు చూస్తున్నాయన్నారు. రైతు బంధు, రైతు బీమా, గోదావరి జలాల గురించి రైతుల్లో అవగాహన కల్పించే బాధ్యత స్థానిక నాయకత్వానిదేనని జగదీష్ రెడ్డి అన్నారు.
తాజా ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/