నల్లమలలో అటవీ ప్రాంతంలో కార్చిచ్చు

Bushfire in nallamala forest
Bushfire in nallamala forest

నాగర్‌కర్నూల్‌: నల్లమల అడవిలో కార్చిచ్చు చెలరేగింది. నాగర్‌కర్నూల్ జిల్లా నల్లమల అటవీ ప్రాంతంలో అగ్ని ప్రమాదం జరిగింది. దోమలపెంటవటవర్లపల్లి మార్గంలో శ్రీశైలం వెళ్లే మార్గంలో మంటలు చెలరేగాయి. దాంతో నల్లమలలో కిలోమీటర్ల మేర మంటలు వ్యాపిస్తున్నాయి. పెద్ద మొత్తంలో మంటలు విస్తరిస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదు. ఐతే నల్లమల అడవిలో మంటలు ఎలా చెలరేగాయనేది తెలియాల్సి ఉంది.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/international-news/