టిఆర్‌ఎస్‌ పార్టీలో బిజెపి యువకులు చేరిక

trs
trs

సిద్దిపేట: దుబ్బాక నియోజ‌క‌వ‌ర్గం ఉప ఎన్నిక నేప‌థ్యంలో ఆనాజ్‌పూర్‌, తిమ్మ‌క్క‌ప‌ల్లి గ్రామాల‌కు చెందిన బిజెపి యువ‌కులు ఆర్థిక మంత్రి హ‌రీష్ రావు స‌మ‌క్షంలో టిఆర్‌ఎస్‌ పార్టీలో చేరారు. ఈ సంద‌ర్భంగా యువ‌కులంద‌రికీ గులాబీ కండువాలు క‌ప్పి హ‌రీష్‌రావు పార్టీలోకి సాద‌రంగా ఆహ్వానించారు. హ‌రీష్ రావు మాట్లాడుతూ.. యువకులే టిఆర్‌ఎస్‌ పార్టీ సైనికులు అని హ‌రీష్ రావు స్ప‌ష్టం చేశారు. విశ్వసనీయత కలిగిన పార్టీకి, ప్రభుత్వానికి మద్దతు తెలపడంలో యువత ముందుంటారని.. అలాంటి వారు టిఆర్‌ఎస్ పార్టీలో చేరడం శుభపరిణామం అని అన్నారు. యువతను ఆకర్షించేలా బిజెపి, కాంగ్రెస్ పార్టీలు మాయమాటలు చెబుతున్న విషయాన్ని గ్రహించి పని చేసే పార్టీ వైపు వచ్చిన వారందరికీ తగిన గుర్తింపు ఇస్తామన్నారు. కళ్ళ ముందు కనిపించని నాయకులకు దుబ్బాక నియోజకవర్గంలో ఓట్లు అడిగే హక్కు లేదన్నారు. యువతకు ఏ అవసరం వచ్చినా ఈ ప్రాంతంలో నేను, రామలింగన్న అండగా నిలబడ్డామని గుర్తు చేశారు.


తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/