సిఎం కెసిఆర్ సాయంపై అసదుద్దీన్ ట్వీట్
హైదరాబాద్: తెలంగాణ సిఎం కెసిఆర్, జయశంకర్ భూపాలపల్లి జిల్లా కలెక్టర్ మహ్మద్ అబ్దుల్ అజీమ్ లు చేసిన సాయానికి ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసి మెచ్చుకున్నారు. అందుకు సంబంధించిన ఫోటోలను తన ట్విట్టర్లో పోస్టు చేశారు. ఇటీవలే సిఎం కెసిఆర్ ఓ వృద్ధుడిని గుర్తించి తన వద్దకు వెళ్లి మరీ సాయం చేసిన విషయం తెలిసిందే. మరోవైపు ఫించన్ కోసం కలెక్టరేట్ కు వచ్చి మెట్లపై కూర్చున్న ఓ వృద్ధురాలి వద్దకు వచ్చి తాను కూడా మెట్లపై కూర్చుని జయశంకర్ భూపాలపల్లి జిల్లా కలెక్టర్ మహ్మద్ అబ్దుల్ అజీమ్ వెంటనే స్పందించి ఫించన్ మంజూరు చేశారు. దీనిపై ఒవైసీ ట్వీట్ చేస్తూ.. ‘పేదల సమస్యలు పరిష్కరించడానికి ఇదో చక్కటి మార్గం.. ఎంతో వినయాన్ని, ప్రజాధికార వ్యవస్థను చక్కగా చూపుతోంది. ఈ విషయానికి ఉదాహరణగా తెలంగాణ ముఖ్యమంత్రి, కలెక్టర్ అజీం సార్ చూపెట్టిన మార్గాన్ని అందరు సీఎంలు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఐఏఎస్, ఐపీఎస్ ఆఫీసర్లు పాటించాలి’ అని చెప్పారు.
తాజా క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/news/sports/