చంద్రబాబును అడ్డుకొని ప్రభుత్వం ఘోర తప్పిదం చేసింది
పోలీసుల తీరుపై గవర్నర్కు ఫిర్యాదు చేసిన టిడిపి నేతలు
విజయవాడ: చంద్రబాబు పర్యటనను అడ్డుకొని వైఎస్ఆర్సిపి ప్రభుత్వం ఘోర తప్పిదం చేసిందని టిడిపి నేత వర్ల రామయ్య విమర్శించారు. విశాఖలో చంద్రబాబు పర్యటన నేపథ్యంలో పోలీసుల తీరుపై శనివారం గవర్నర్ టిడిపి నేతలు ఫిర్యాదు చేశారు. అనంతరం వర్ల రామయ్య మీడియాతో మాట్లాడుతూ…చంద్రబాబు పర్యటన సజావుగా కొనసాగేలా ప్రభుత్వం ఏర్పాటు చేయాలని సూచించారు. నిరసనకారులను వైఎస్ఆర్సిపి ప్రభుత్వం ఎందుకు నిలువరించలేకపోయిందని వర్ల రామయ్య ప్రశ్నించారు. శాంతిభద్రతలను అదుపుచేయడంలో ప్రభుత్వం విఫలమైందని దుయ్యబట్టారు. అల్లర్లు చేసే వారిని కంట్రోల్ చేయకుండా..చంద్రబాబును కంట్రోల్ చేస్తారా? అని నిలదీశారు. విశాఖలో మొన్న జరిగిన ఘటన చూసి పోలీస్ వ్యవస్థ మొత్తం నవ్వుకుందని వర్ల రామయ్య పేర్కొన్నారు.
తాజా క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/sports/