అఫ్గానిస్థాన్లో హైదరాబాద్ వాసికి గాయాలు
లాక్ డౌన్ వేళ ఎయిర్ అంబులెన్స్ కు అనుమతించిన అధికారులు..నగరానికి తరలింపు
హైదరాబాద్: ఉపాధి కోసం ఆఫ్గనిస్థాన్ కు వెళ్లిన ఓ హైదరాబాద్ వ్యక్తి ఓ ప్రైవేటు కంపెనీలో పని చేస్తుండగా, రోడ్డు ప్రమాాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఆయన వెన్నెముకకు తీవ్రగాయమై, పరిస్థితి విషమించింది. అతనికి అవసరమైన అత్యాధునిక వైద్యం ఆఫ్గన్ లో లభించే పరిస్థితి లేకపోవడంతో, ఐసీఏటీటీ హెల్త్ సొల్యూషన్స్ ప్రైవేటు లిమిటెడ్ ఆధ్వర్యంలోని ఎయిర్ అంబులెన్స్ లో హైదరాబాద్ కు తీసుకొచ్చేందుకు ప్రత్యేక అనుమతిని కోరగా, అధికారులు అంగీకరించారు. దీంతో అక్కడి డాక్టర్లు రాహుల్ సింగ్, శాలినీ నల్వాద్ లు బాధితుడిని వెంట తీసుకుని శంషాబాద్ ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు. ఆపై రోడ్డు మార్గం ద్వారా ఓ ప్రైవేటు ఆసుపత్రికి బాధితుడిని తరలించారు.
తాజా ఏపి వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/