ప్రజలకు కెసిఆర్-జగన్ల హోళీ శుభాకాంక్షలు
హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల ప్రజలకు ముఖ్యమంత్రులు హోళీ శుభాకాంక్షలు తెలియజేశారు. హోళీ పండుగ సందర్భంగా… తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ రంగుల వసంతోత్సవాన్ని ప్రజలంతా కూడా ఆనందోత్సవాలతో జరుపుకోవాలని మనస్పూర్తిగా ఆకాంక్షిస్తున్నట్లు తెలిపారు. ఇక ఏపి సిఎం జగన్ కూడా రాష్ట్ర ప్రజలకు హోళీ శుభాకాంక్షలు తెలిపారు. రంగుల పండుగ అందరి జీవితాల్లో శాంతి సౌఖ్యాలు నింపాలని ఆకాంక్షించారు.
తాజా క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/news/sports/