తెలంగాణ అసెంబ్లీ రేపటికి వాయిదా

telangana-assembly-adjourned-to-tomorrow

హైదరాబాద్‌: తెలంగాణ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలను స్పీకర్ వాయిదా వేశారు. సభ ప్రారంభమయ్యాక దివంగత ఎమ్మెల్యే సాయన్నకు సంతాపం తెలుపుతూ ఆయన చేసిన సేవలను సిఎం కెసిఆర్‌, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, బిజెపి ఎమ్మెల్యే రఘునందన్ రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్, ప్రశాంత్ రెడ్డి, దానం నాగేందర్, ఇతర ఎమ్మెల్యేలు స్మరించుకున్నారు. అనంతరం రెండు నిమిషాలు మౌనం పాటించి సభను రేపు 10 గంటలకు వాయిదా వేశారు. కాగా, మరికాసేపట్లో స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌ నేతృత్వంలో బీఏసీ సమావేశం జరుగనున్నది. ఈ సందర్భంగా సమావేశాలు ఎన్నిరోజులపాటు నిర్వహించాలి, ఏయే అంశాలపై చర్చించాలనే అంశాలను నిర్ణయించనున్నారు.