అల్లూరి జిల్లాలో తహసీల్దార్‌ ఆత్మహత్య

ఆఫీసు పక్కనున్న షెడ్ లో ఉరి వేసుకున్న వైనం

suicide cases
tehsildar-commits-suicide-in-alluri-district

అమరావతిః ఏపీలోని అల్లూరి సీతారామరాజు జిల్లాలో విషాదకర ఘటన చోటు చేసుకుంది. పెదబయలు మండల తహశీల్దార్ శ్రీనివాసరావు ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ ఉదయం ఆయన యథావిధిగా ఆఫీసుకు వచ్చారు. అటెండర్ ను పిలిచి టిఫిన్ తీసుకురావాలని చెప్పారు. టిఫిన్ తీసుకు వచ్చిన అటెండర్ కు శ్రీనివాసరావు కనిపించలేదు. దీంతో, ఆ ప్రాంతమంతా వెతకగా… పక్కనే ఉన్న ఒక షెడ్ లో ఆయన ఉరి వేసుకుని ఉండటాన్ని గమనించాడు. అప్పటికే ఆయన మృతి చెందారు. ఈ ఘటనతో అక్కడ విషాదం నెలకొంది.

మరోవైపు ఇటీవల కలెక్టరేట్ లో జరిగిన సమావేశానికి శ్రీనివాసరావు వెళ్లారు. ఈ సందర్భంగా భూముల సర్వే విషయంలో ఆయనపై ఉన్నతాధికారులు ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఆయన మనస్తాపానికి గురై, ఆత్మహత్యకు పాల్పడినట్టు భావిస్తున్నారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు వెల్లడి కావాల్సి ఉంది. ఇటీవలే ఆయన పెదబయలు తహశీల్దారుగా బాధ్యతలను చేపట్టారు.

తాజా సినిమా వార్తల కోసం క్లిక్‌ చేయండిః https://www.vaartha.com/news/movies/