బిఆర్ఎస్ లో చేరిన టిడిపి సీనియర్ నేత రావుల చంద్రశేఖర్ రెడ్డి

టిడిపి నుంచి రెండు సార్లు ఎమ్మెల్యేగా, ఒక్క సారి రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికైన రావుల

tdp-senior-leader-ravula-chandra-sekhar-reddy-joins-brs

హైదరాబాద్‌ః తెలంగాణలో టిడిపికి మరో షాక్ తగిలింది. పార్టీలో తొలి నుంచి ఉన్న సీనియర్ నేత రావుల చంద్రశేఖర్ రెడ్డి టిడిపికి గుడ్ బై చెప్పారు. టిడిపితో ఉన్న సుదీర్ఘమైన అనుబంధాన్ని తెంచుకుని బిఆర్ఎస్ లో చేరారు. హైదరాబాద్ లోని తెలంగాణ భవన్ లో బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కెటిఆర్ సమక్షంలో గులాబీ కండువా కప్పుకున్నారు. ఈ సందర్భంగా రావులను కెటిఆర్ పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో మంత్రి నిరంజన్ రెడ్డి, ఎంపీ రాములు, ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి, మాజీ ఎంపీ మందా జగన్నాథంతో పాటు పలువురు నేతలు పాల్గొన్నారు.

టిడిపి తరపున రావుల చంద్రశేఖర్ రెడ్డి 1994, 2009 ఎన్నికల్లో వనపర్తి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. 1994లో ఉమ్మడి ఏపీ ప్రభుత్వ విప్ గా పని చేశారు. టిడిపి తరపున రాజ్యసభ సభ్యుడిగా కూడా ఎన్నికయ్యారు. టిడిపి పొలిట్ బ్యూరో సభ్యుడిగా కూడా బాధ్యతలను నిర్వహించారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత టిడిపి ముఖ్యనేతలంతా ఇతర పార్టీల్లోకి వెళ్లారు. రావుల మాత్రం టిడిపిని వీడలేదు. ఇప్పుడు ఆయన పార్టీ మారారు.