నేడు గవర్నర్ అబ్దుల్ నజీర్‌ను కవలనున్న టిడిపి నేతలు

బాబు అరెస్ట్, టిడిపి నేతల నిర్బంధాలను గవర్నర్ కు వివరించనున్న నేతలు

tdp-leaders-to-meet-ap-governor-today

అమరావతిః టిడిపి నేతలు ఈరోజు ఏపీ రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ ను కలవనున్నారు. గవర్నర్ ను కలిసేందుకు వీరికి సాయంత్రం 5 గంటలకు అపాయింట్ మెంట్ లభించింది. చంద్రబాబు అరెస్ట్, టిడిపి నేతల నిర్బంధాలు, రాష్ట్రంలోని రాజకీయ పరిణామాలను వీరు గవర్నర్ దృష్టికి తీసుకెళ్లనున్నారు. 17ఏ నిబంధనను ప్రభుత్వం పట్టించుకోవడం లేదనే విషయాన్ని గవర్నర్ కు వివరించనున్నారు. గవర్నర్ ను కలవనున్న వారిలో అచ్చెన్నాయుడు, యనమల రామకృష్ణుడుతో సహా మరికొందరు సీనియర్ నేతలు ఉన్నారు. గవర్నర్ కు వివరించాల్సిన విషయాలపై చర్చించేందుకు వీరు పార్టీ కేంద్ర కార్యాలయంలో భేటీ అయ్యారు.