ఏపీ వ్యాప్తంగా కొనసాగుతున్న బంద్

చంద్రబాబు అరెస్ట్ కు నిరసన గా ఏపీ వ్యాప్తంగా బంద్ కొనసాగుతుంది. తమ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ను జగన్ కక్ష్య సాధింపు చర్య గా అరెస్ట్ చేసారని తెలుపుతూ..ఏపీ బంద్ కు టీడీపీ పిలుపునిచ్చింది. ఈ బంద్ కు జనసేన, సీపీఐ, లోక్ సత్తా, జైభీమ్ పార్టీలు మద్దతు తెలుపుతూ బంద్ లో పాల్గొన్నాయి. బంద్ నేపథ్యంలో టీడీపీ శ్రేణులు రోడ్ల మీదకు వచ్చి ఆందోళన కార్యక్రమాలు చేపట్టారు.

ముఖ్యమంత్రి జగన్ కు, వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. టీడీపీ కార్యకర్తలను పోలీసులు బలవంతంగా అదుపులోకి తీసుకుని తరలిస్తున్నారు. పలు చోట్ల టీడీపీ శ్రేణులపై పోలీసులు చేయి చేసుకున్న వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. పలు చోట్ల విద్యా సంస్థలు, షాపులను స్వచ్చందంగా మూసివేశారు యాజమాన్యాలు. మరోపక్క రాష్ట్ర వ్యాప్తంగా పోలీసులు 144 సెక్షన్ ను అమలు చేస్తున్నారు.