హైద‌రాబాద్ చేరుకున్న సీఎం కేసీఆర్

cm kcr

తెలంగాణ సీఎం కేసీఆర్ ఢిల్లీ నుండి హైదరాబాద్ కు చేరుకున్నారు. ఢిల్లీ లో బిఆర్ఎస్ కార్యాలయం ప్రారంభం సందర్భాంగా ఈ నెల 12 న ఢిల్లీ కి వెళ్లిన కేసీఆర్..ఈరోజు శుక్రవారం హైదరాబాద్ కు చేరుకున్నారు. ఈ నెల 14వ తేదీన బీఆర్ఎస్ కేంద్ర కార్యాల‌యాన్ని కేసీఆర్ ప్రారంభించిన సంగతి తెలిసిందే. బుధ‌వారం మ‌ధ్యాహ్నం నుంచి శుక్ర‌వారం సాయంత్రం వ‌ర‌కు కేసీఆర్ ఢిల్లీలో బిజీబిజీగా గ‌డిపారు.

బీఆర్ఎస్ పార్టీ కార్యాల‌యం ప్రారంభోత్స‌వ కార్య‌క్ర‌మంలో స‌మాజ్‌వాదీ పార్టీ అధినేత‌, యూపీ మాజీ సీఎం అఖిలేశ్ యాద‌వ్, జేడీఎస్ అధినేత‌, క‌ర్ణాట‌క మాజీ సీఎం కుమార‌స్వామి, తమిళనాడుకు చెందిన విడుతలై చిరుతైగల్‌ కచ్చి పార్టీ ఎంపీ చిదంబరం, పలు రాష్ట్రాల రైతు సంఘం నాయకుల‌తో పాటు బిఆర్ఎస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, ఇత‌ర నాయ‌కులు పాల్గొన్నారు.