స్టేజ్ ఎక్కుతూ కిందపడిన గవర్నర్ తమిళసై

శుక్రవారం హైదరాబాద్‌ జేఎన్టీయూలో జరిగిన పూర్వ విద్యార్థుల సమ్మేళన కార్యక్రమంలో చేదు అనుభవం ఎదురైంది. ఈ కార్యక్రమంలో గవర్నర్ వేదికపైకి వెళ్తుండగా మెట్లు ఎక్కుతూ ఒక్కసారిగా కింద పడిపోయారు. అయితే తన రెండు చేతులు కిందకు పెట్టడంతో ఆమెకు పెద్దగా దెబ్బలు తగల్లేదు. వెంటనే గవర్నర్ వెనుక ఉన్న సెక్యూరిటీ సిబ్బంది గవర్నర్‌‌కు సహాయం చేసి పైకి లేపారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

గతంలో కూడా గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ నడుస్తూ కిందపడిన సంగతిని అంత గుర్తు చేస్తున్నారు. తమిళనాడులోని మహాబలిపురం సమీపంలో పత్తిపులం గ్రామంలో నిర్వహించిన ఓ కార్యక్రమానికి గవర్నర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె నడుస్తూ వేదికపైకి వెళ్తుండగా కార్పెట్ మీద ఒక్కసారిగా జారి కిందపడ్డారు. ఇప్పుడు కూడా అలాగే జరిగిందని అంత మాట్లాడుకోవడం మొదలుపెట్టారు.