ఇండస్ట్రీలో మరో విషాదం.. ప్రముఖ కమెడియన్‌ కన్నుమూత

చిత్రసీమలో వరుస విషాదాలు ఆగడం ఆగడం లేదు. నందమూరి తారకరత్న మరణ వార్త యావత్ సినీ లోకాన్ని షాక్ కు గురి చేయగా..మరో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ కోలీవుడ్‌ కమెడియన్ మయిల్‌స్వామి కన్నుమూశాడు. ఆదివారం తెల్లవారుజామున మయిల్‌ స్వామి ఒంట్లో నలతగా ఉండటంతో కుటుంబసభ్యులు సమీపంలోని పోరూర్‌లోని ఆసుపత్రికి తరలించారు. అప్పటికే ఆయన చనిపోయినట్లు డాక్టర్‌లు తెలిపారు. మయిల్‌ స్వామి మరణంతో తమిళ ఇండస్ట్రీలో విషాద చాయలు అలుముకున్నాయి. కాగా.. తన 39 ఏళ్ల కెరీర్‌లో మయిల్‌సామీ 200కి పైగా సినిమాల్లో నటించారు. ఆయన ఆసాధారణ కామెడీ టైమింగ్ తమిళ పరిశ్రమలో ఆయనకి ‘సీన్ స్టీలర్’ అనే బిరుదుని సంపాదించి పెట్టింది.

ఈయన మృతిపై తమిళ సినీ నటులు, రాజకీయ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ గవర్నర్ తమిళసై సౌందరరాజన్ కూడా మ‌యిల్ స్వామి మరణంపై ట్విట్టర్ వేదికగా సంతాపం వ్యక్తం చేసారు. ఈ సందర్భంగా తమిళసై మాట్లాడుతూ.. హాస్యనటుడు మయిల్ స్వామి అనారోగ్య కారణాలతో మరణించారనే వార్త విని బాధపడినట్టు పేర్కొన్నారు. ఈ సందర్భంగా మయిల్ సామి కుటుంబ సభ్యులకు, అభిమానులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నట్టు పేర్కొన్నారు.