బోగి పండుగ లోపు ఏపీలో సీఎం మారతారంటూ కాంగ్రెస్ మాజీ నేత సంచలన వ్యాఖ్యలు
ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఫై సంచలన వ్యాఖ్యలు చేసారు మాజీ కేంద్రమంత్రి, ఏపీ కాంగ్రెస్నేత చింతా మోహన్. రాష్ట్రంలో అధికారం చేపట్టిన దగ్గరి నుండి జగన్ తనదైన మార్క్ రాజకీయం చేస్తూ అందరికి ఆదర్శం అవుతున్నారు. ఎన్నికల మేనిఫెస్ట్ లో చెప్పినట్లు అన్ని సంక్షేమ పధకాలు అమలు చేస్తూ వస్తున్నారు. ఈ క్రమంలో కాంగ్రెస్నేత చింతా మోహన్ బోగి పండుగ లోపు ఏపీలో సీఎం మారతారంటూ చెప్పడం సంచలనంగా మారింది.
పేదలకు అందిస్తున్న బియ్యంలో 50 శాతం ప్రజాప్రతినిధులు పక్కదారి పట్టిస్తున్నారని, సీఎం కుర్చీ పోతుందన్న భయంతోనే జగన్ బయటకు రావడంలేదని అన్నారు. రాష్ట్రంలోనూ, దేశంలోనూ ప్రత్యామ్నాయాన్ని ప్రజలు కోరుకుంటున్నారని, అది కాంగ్రెస్ వలనే సాధ్యం అవుతుందని చింతా మోహన్ పేర్కొన్నారు.