వైసీపీలో చేరిన టీడీపీ మాజీ ఎమ్మెల్యే

ఏపీలో ఎన్నికలు దగ్గర పడుతుండడం తో రాజకీయ నేతల వలసల పర్వం కొనసాగుతుంది. ముఖ్యంగా టికెట్ రాని నేతలంతా తమకు టికెట్ ఇచ్చే పార్టీలలో చేరుతున్నారు. తాజాగా టిడిపి ఎంపీ కేశినేని నాని ..టిడిపి లో టికెట్ ఇవ్వమని చెప్పడం తో..జగన్ సమక్షంలో వైసీపీ లో చేరి..విజయవాడ ఎంపీ టికెట్ దక్కించుకున్నాడు. ఇదే క్రమంలో తాజాగా టిడిపి మాజీ ఎమ్మెల్యే సైతం టీడీపీ కి రాజీనామా చేసి వైసీపీ లో చేరారు.

జగన్‌ సమక్షంలో తిరువూరు టీడీపీ మాజీ ఎమ్మెల్యే నల్లగట్ల స్వామిదాస్, ఆయన సతీమణి సుధారాణి వైసీపీలో చేరారు. వైసీపీ కండువా కప్పి సీఎం జగన్‌ వారిని పార్టీలోకి ఆహ్వానించారు. 1994, 1999లో రెండు సార్లు తిరువూరు నియోజకవర్గం టీడీపీ ఎమ్మెల్యేగా స్వామిదాస్‌ గెలుపొందారు. ఈ కార్యక్రమంలో ఎంపీ ఆళ్ళ అయోధ్య రామిరెడ్డి, ఎమ్మెల్సీలు మర్రి రాజశేఖర్, మొండితోక అరుణ్‌కుమార్, ఎమ్మెల్యే వెలంపల్లి శ్రీనివాసరావు పాల్గొన్నారు.