నిజామాబాద్ ఆస్పత్రి ఘటనపై సూపరింటెండెంట్‌ ప్రతిమరాజ్‌ క్లారిటీ

నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో అమానుష సంఘటన ప్రస్తుతం మీడియా లో హాట్ టాపిక్ గా మారింది. అనారోగ్య సమస్యతో నడవలేని స్థితిలో ఓ రోగి ఆసుపత్రికి వచ్చాడు. స్ట్రెచర్‌ అందుబాటులో లేకపోవడం హోం బయట నుంచి రెండో అంతస్థు లిప్ట్ వరకు రోగి బంధువులే అతని కాళ్లు పట్టుకుని ఈడ్చుకుంటూ తీసుకెళ్లారు. ఈ ఘటన సోషల్ మీడియా లో వైరల్ గా మారడంతో ప్రతిపక్ష పార్టీ లు ప్రభుత్వం ఫై , ఆరోగ్య మంత్రి ఫై విమర్శలు చేస్తున్నారు.

ఈ క్రమంలో అసలు ఏంజరిగిందో సూపరింటెండెంట్‌ ప్రతిమరాజ్‌ క్లారిటీ ఇచ్చారు. లిప్ట్ వచ్చిందనే తొందరలో రోగి బంధువులే అలా లాక్కెళ్లారని స్పష్టం చేశారు. అలా లాక్కొని వెళుతున్న క్రమంలో అటెండర్లు చూసి వారిని తిట్టి.. వీల్ ఛైర్లో పేషెంట్ ను ఎక్కించుకున్నారని ఆమె స్పష్టం చేశారు. ఆస్పత్రి సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని వస్తున్న వార్తలను ఆమె ఖండించారు. కేవలం ఆసుపత్రిని నిందించడానికే సోషల్ మీడియాలో తప్పుడు కథనాలు ప్రసారం చేస్తున్నారని మండిపడ్డాురు. వారిపై పోలీసులకు ఫిర్యాదు చేశామని సూపరింటెండెంట్ తెలిపారు. ఈ ఘటనపై విచారణ జరిపి తనకు నివేదిక అందజేయాల్సిందిగా డీఎంఆర్ ను వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు ఆదేశాలు జారీ చేసారు.