లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు

sensex
sensex

ముంబయి; దేశీయ స్టాక్ మార్కెట్లు నేడు భారీ లాభాలతో ముగించాయి. కేంద్ర ప్రభుత్వం ఉద్దీపన ప్యాకేజి ప్రకటించిన నేపథ్యములో దేశఆర్థిక వ్యవస్థ పుంజుకుంటుందన్న అంచనాలతో మదుపరులు కొనుగోళ్ళకు మొగ్గు చూపారు. దీనితో ఈ రోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 606 పాయింట్లు లాభపడి 32,720 కు చేరుకుంది. నిఫ్టీ 172 పాయింట్లు లాభ పడి 9,553 వద్ద ముగిసింది.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి ; https://www.vaartha.com/telangana/