భారీ లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

stock market
stock market

ముంబయిః దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు భారీ లాభాలను మూటకట్టుకున్నాయి. ఈ ఉదయం ట్రేడింగ్ ను లాభాలతో ప్రారంభించిన మార్కెట్లు చివరి వరకు అదే ట్రెండ్ ను కొనసాగించాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 491 పాయింట్లు లాభపడి 71,847కి చేరుకుంది. నిఫ్టీ 141 పాయింట్లు పుంజుకుని 21,659కి పెరిగింది. మార్కెట్లు ముగిసే సమయానికి డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ.83.22 వద్ద కొనసాగుతుంది.