బైజూస్ సీఈవో నివాసం, కార్యాలయాల్లో ఈడీ సోదాలు
బెంగళూరు: బైజూస్ సీఈవో రవీంద్రన్ ఇల్లు, కార్యాలయాల్లో ఈడీ సోదాలు చేపట్టింది. విదేశీ మారక ద్రవ్య ఉల్లంఘన కింద ఈడీ తనిఖీలు చేస్తోంది. మొత్తం మూడు ప్రాంతాల్లో తనిఖీలు చేస్తున్నట్లు సమాచారం. ఇందులో పలు డాక్యుమెంట్లు, డిజిటల్ డేటాను అధికారులు స్వాధీనం చేసుకున్నట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. ఈ కంపెనీ 2011 నుంచి 2023 మధ్య ₹28వేల కోట్ల విలువైన ఎఫ్డీఐ(విదేశీ పెట్టుబడులు)లు అందుకున్నట్లు దర్యాప్తు సంస్థ వర్గాలు పేర్కొన్నాయి.