జయహో బీసీ కార్యక్రమాన్ని తీసుకువచ్చిన టిడిపి
చంద్రబాబు అధ్యక్షతన అమరావతిలో జయహో బీసీ సదస్సు
అమరావతిః తెలుగుదేశం పార్టీ తాజాగా జయహో బీసీ కార్యక్రమాన్ని తీసుకువచ్చింది. టిడిపి అధినేత చంద్రబాబు అధ్యక్షతన అమరావతిలో జయహో బీసీ సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చంద్రబాబు మాట్లాడుతూ… టిడిపి పాలనలో బీసీలకు ఎంత మేలు జరిగిందో, వైఎస్ఆర్సిపి పాలనలో బీసీలు ఏం కోల్పోయారో జయహో బీసీ సదస్సు ద్వారా తెలియజేస్తున్నామని చెప్పారు. జయహో బీసీ కోసం 40 రోజుల కార్యాచరణ రూపొందించామని… జయహో బీసీ లక్ష్యాను పార్లమెంటు, అసెంబ్లీ నియోజకవర్గాల్లో క్షేత్రస్థాయికి తీసుకువెళ్లేలా ప్రణాళిక రచించామని చంద్రబాబు వివరించారు.