ముంబై ఎయిర్‌పోర్ట్‌లో బాద్ షా కు చేదు అనుభవం

బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ కు ముంబై ఎయిర్ పోర్ట్ లో చేదు అనుభవం ఎదురైంది. దుబాయ్‌లో ఇటీవల ముగిసిన ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్‌కి హాజరైన షారూక్ ఖాన్ ఈరోజు ముంబయికి చేరుకున్నారు. ఈ క్రమంలో ఎయిర్ పోర్ట్ లో కస్టమ్స్ అధికారులు షారూక్‌ ను అడ్డుకున్నారు.

దుబాయ్‌లో షాపింగ్ చేసిన షారూక్ రూ.18 లక్షల విలువైన లగ్జరీ వాచీలను కొనుగోలు చేశాడు. వాటిని తీసుకుని ముంబయి విమానాశ్రయంలో దిగగా.. అతని లగేజీని చెక్ చేసిన కస్టమ్స్ అధికారులు ఆ వాచీలపై ఆరా తీశారు. ఈ క్రమంలో చాలా సేపు షారూక్ ఖాన్ ఎయిర్‌పోర్ట్‌లోనే ఉండిపోయాడు. చివరికి ఆ రూ.18 లక్షల విలువైన వాచీలకి గానూ రూ.6.83 లక్షలు కస్టమ్స్ డ్యూటీ కట్టిన తర్వాత షారూక్‌ని విమానాశ్రయం వెలుపలికి అధికారులు అనుమతించారు. ఇలా షారుఖ్ ఖరీదైన వాచ్ లతో దొరకడం ఇది రెండో సారి. 2011లో కూడా ఇలానే విమానాశ్రయంలో కస్టమ్ అధికారులకి షారూక్ దొరికాడు. అప్పట్లో అతను ఏకంగా రూ.1.5 కోట్లని కస్టమ్స్ డ్యూటీ కింద కట్టాల్సి వచ్చింది.