తారకరత్న మరణంపై శ్రీరెడ్డి వివాదస్పద వ్యాఖ్యలు

తారకరత్న మరణం తో యావత్ సినీ, రాజకీయ లోకం దిగ్బ్రాంతి వ్యక్తం చేస్తుంటే..వివాదాలకు కేరాఫ్ గా నిలిచే శ్రీరెడ్డి మాత్రం తారకరత్న మరణం ఫై వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది. నారా వారి క్షుద్ర పూజలకు..తారక్ బలైందంటూ శ్రీ రెడ్డి పేర్కొన్నారు. బిడ్డ వచ్చిన వేళా ,గొడ్డు వచ్చిన వేళా అంటారు మన తెలుగోళ్లు ..మొదటి రోజు యాత్రకు వాళ్ళు చేయించిన క్షుద్ర పూజలకు నిన్ను బలి ఇచ్చారు మిత్రమా అంతే..నంద..మూరిని తెగటార్చాటానికి వచ్చిన నా..రా. …హ హ హ.. హ హ హ…ఇది నీతో ఆగేది కాదులే నువ్వు మూడవ వాడివి అంతే ,ఇంకా లెక్క ఆగలే ..”రక్తదాహం రాజకీయం”మీకు శాపాలై పీడుస్తున్నాయి .. నేను ముందు నుంచి చెప్తూనే వున్నా వింటేగా ..తస్మాత్ జాగ్రత జాగ్రత్త .. నీ ఆత్మ కు శాంతి అంటూ సంచలన ట్వీట్ చేసింది. ప్రస్తుతం ఈ ట్వీట్ ఫై టీడీపీ , నందమూరి అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఇదిలా ఉంటె నందమూరి తారకరత్న శనివారం రాత్రి కన్నుమూసిన సంగతి తెలిసిందే. 23 రోజుల క్రితం నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్రలో పాల్గొన్న తారక రత్న గుండెపోటుకు గురయ్యారు. వెంటనే మెరుగైన చికిత్స కోసం బెంగుళూర్ లోని నారాయణ హృదయాల హాస్పటల్ కు తరలించారు. అప్పటి నుండి మెరుగైన వైద్యం అందిస్తున్నప్పటికీ తారకరత్న ఆరోగ్యం కుదుట పడలేదు. శనివారం తుదిశ్వాస విడిచారు. ప్రస్తుతం తారకరత్న భౌతికాయాన్ని రంగారెడ్డి జిల్లా మోకిలలోని తన నివాసానికి తరలించారు. దీంతో తారకరత్న ను కడసారి చూసేందుకు సినీ , రాజకీయ ప్రముఖులు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు.