ఉప్పల్- ఎల్బీనగర్, దిల్ సుఖ్ నగర్- కోఠీ రోడ్లు మూసివేత

జీహెచ్ఎంసీ ప‌రిధిలో రెండు రోజుల పాటు సెల‌వులు

Heavy Rain-
Heavy Rain-

Hyderabad: న‌గ‌రాన్ని వ‌ర్షాలు ముంచెత్తుతున్నాయి. భారీ వ‌ర్షాల నేప‌థ్యంలో జీహెచ్ఎంసీ అధికారులు అప్ర‌మ‌త్త‌మ‌య్యారు. న‌గ‌ర వ్యాప్తంగా హైఅల‌ర్ట్ ప్ర‌క‌టించారు.

జీహెచ్ఎంసీ ప‌రిధిలో రెండు రోజుల పాటు సెల‌వులు ప్ర‌క‌టించారు. అధికార యంత్రాంగం స‌హాయ‌క చ‌ర్య‌లు ముమ్మ‌రం చేసింది. ఇక  -ఉప్ప‌ల్ – ఎల్బీన‌గ‌ర్‌, దిల్‌సుఖ్‌న‌గ‌ర్ – కోఠి రోడ్లు మూసివేశారు. 

-బేగంపేట‌లో ర‌హ‌దారిపై భారీగా వ‌ర‌ద నీరు పారుతోంది. కాచిగూడ రైల్వేష్టేష‌న్‌లో ప‌ట్టాల‌పై నిలిచిన వ‌ర్ష‌పు నీరు నిలిచింది. అలాగే నిజాంపేట‌తో పాటు బండారి లేఅవుట్ జ‌ల‌మ‌యమైంది.

 మెహిదీప‌ట్నం – హైటెక్ సిటీ ర‌హ‌దారి  జలమయమైంది.

కూక‌ట్‌ప‌ల్లి ఐడీపీఎల్‌, హాఫిజ్‌పేట చెరువులకు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. హుస్సేన్ సాగర్ నాలుగు గేట్లు తెరిచి నీటిని దిగువకు వదులుతున్నారు.

గ‌చ్చిబౌలి నుంచి హెచ్‌సీయూ వెళ్లే దారిలో భారీగా వ‌ర్ష‌పు నీరు నిలిచింది.

బెంగ‌ళూరు – హైద‌రాబాద్‌, విజ‌య‌వాడ హైవేలపై రాకపోకలను నిలిపివేశారు. బల్కంపేట ఎల్లమ్మ దేవాలయంలోనికి నీరు ప్రవేశించింది.

తాజా జాతీయ వార్తల కోసం : https://www.vaartha.com/news/national/