దర్యాప్తులో కరోనాగుట్టు తేలేనా?
కల్లోలం మిగిల్చిన ‘మహమ్మారి’
చైనాలోని వూహాన్ నగర కేంద్రంగా పుట్టుకొచ్చిన కరో నా మహమ్మారి సృష్టిస్తున్న కల్లోలానికి ప్రపంచం మొత్తం చిగురు టాకులా వణికిపోతోంది.
రోజు రోజుకు అత్యంత వేగంగా వ్యాపి స్తున్న కరోనా రక్కసి బారినపడి లక్షలసంఖ్యలో మరణాలు సంభ విస్తున్నాయి.
ప్రపంచదేశాల ఆర్థిక వ్యవస్థలు అతలాకుతలమవుతోన్న నేపథ్యంలో కోట్ల సంఖ్యలో ఉద్యోగాలుపోతున్న తరుణంలో వేతన జీవులు విలవిల్లాడుతున్నారు.
గత 60రోజులుగా పనిలేని పరిస్థితులలో రెక్కాడితేకానీ డొక్కాడని దినసరి కూలీలు, వలస కార్మికుల బతుకులు చిధ్రమవుతున్నాయి.
ఇటువంటి దుర్భర విపత్కర పరిస్థితు లలో అగ్రరాజ్యాలైన అమెరికా చైనా మధ్య కరోనా తీవ్రమైన కల్లోలానికి కారణమైంది.
కరోనావైరస్ వ్యాప్తికి మీరంటే మీరే కారణమని ఆరోపణలు ప్రత్యారోపణలతో నిత్యం ఇరుదేశాలు సంఘర్షణ పడుతున్నాయి.
కరోనావైరస్ కాదది చైనీస్ వైరస్ అంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన ఆక్రోషం వెళ్లగక్కుతున్నాడు.
ఇరుదేశాల ప్రతినిధులు, దౌత్యాధికారులు, అధినేతల మధ్య మాటలయుద్ధం నడుస్తోంది. ఫలితంగా కరోనా వైరస్ వ్యాప్తి లో కుట్రకోణం దాగి ఉందా అన్న అనుమానాలు ప్రపంచ దేశాల్లో పెరిగిపోతున్నాయి.
ప్రపంచ వ్యాప్తంగా దాదాపు అన్ని దేశాలపైన దుష్ప్రభావం చూపుతున్న కరోనా మహమారిపై సర్వత్ర ఆందోళనలు వ్యక్తమవ్ఞతున్నాయి.
కరోనా సహజ సిద్ధంగా పుట్టిందా? వ్ఞహన్లోని ప్రయోగశాలనుంచే లీకయిం దా? ఇది నిజంగా జీవాయుధమా? అనేక ప్రశ్నలు తలెత్తు తున్నాయి.
ఎట్టకేలకు కరోనా వైరస్ గుట్టు తేల్చేప్రక్రియకు ప్రపంచ ఆరోగ్యసంస్థ అంగీకరించింది.
మే 18, 19వ తేదీలలో స్విట్జర్లాండ్ రాజధాని జెనీవాలో జరిగిన డబ్ల్యూహెచ్ఒ విధాన నిర్ణాయక సంస్థ అయిన ప్రపంచ ఆరోగ్యసభ (వరల్డ్ హెల్త్ అసెంబ్లీ) 73వ వార్షిక సమావేశాల్లో కరోనా వైరస్పై స్వతంత్ర దర్యాప్తుకు ఆమోదం లభించింది.
డబ్ల్యూహెచ్ఒలోని 194 సభ్యదేశాల ఆరోగ్యశాఖల మంత్రులు వరల్డ్ హెల్త్ అసెంబ్లీ (డబ్ల్యూహెచ్ఎ) సభ్యులుగా ఉంటారు.
వార్షిక సమావేశాలు సాధారణంగా మూడు వారాలపాటు జరు గుతాయి.కరోనా పరిస్థితుల నేపథ్యంలో ఈసారి సమావేశా లను రెండ్రోజులకు కుదించటంతోపాటు తొలిసారి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నిర్వహించారు.
కరోనా వైరస్ పుట్టుకపై స్వతంత్ర సంస్థతో అంతర్జాతీయ దర్యాప్తు జరపాలన్న తీర్మా నాన్ని ఈ సదస్సులో యూరోపియన్ యూనియన్ (ఈయు) ప్రవేశపెట్టింది. దీనికి ఆస్ట్రేలియా, జపాన్ వెన్నుదన్నుగా నిలిచాయి.
కరోనావైరస్ ఎక్కడ ఎలా పుట్టింది? మానవ్ఞల్లోకి ఎలా ప్రవేశించింది? ఏ జీవి వాహకంగా పనిచేసింది? కరోనా వ్యాప్తి, వైరస్ పై ప్రపంచ దేశాలను డబ్ల్యూహెచ్ఒ అప్రమత్తం చేసిన తీరు, తీసుకున్న చర్యలు,, శాస్త్రీయ పద్ధతిలో దర్యాప్తు జరుపాలని తీర్మానంలో ప్రతిపాదించారు.
ఈ తీర్మానానికి భారత్సహా 120కి పైగా దేశాలు మద్దతిచ్చాయి.
డబ్లూహెచ్ఒ దర్యాప్తుకు తాము సహకరిస్తామని చైనా అధ్యక్షుడు జిన్పింగ్ పేర్కొన్నారు. కరోనా విషయంలో బాధ్యతతో వ్యవహరించామని, అన్ని విషయాలను బహి రంగంగా ఇతర దేశాలతో పంచుకున్నామని స్పష్టం చేశారు.
కరోనా వైరస్ చైనా పనే అని అమెరికా, అమెరికానుంచే మాకు వచ్చిందని చైనా విమర్శలు కురిపించుకుంటున్న తరుణంలో కరోనా మహమ్మారి పుట్టుక రహస్యం తెలుసు కోవాలని ప్రపంచ రాజ్యాలు వేచిచూస్తున్నాయి.
కరోనాపై పోరులో డబ్ల్యూహెచ్ఒకు సాయపడేందుకు రూ.15,130 కోట్ల ఇవ్వబోతున్నట్లు చైనా అధ్యక్షుడు జిన్పింగ్ వెల్లడించారు.
డిసెంబరు 2019లో చైనాలో వైరస్ పుడితే 2020 మార్చి మొదటివారం వరకు దాన్ని మహమ్మారిగా ప్రకటించకుండా అప్రమత్తం చేయాల్సిన బాధ్యతను పక్కకు పెట్టి టెడ్రోస్ ప్రవర్తించినట్లు అమెరికా, ఐరోపా దేశాలు ఆరో పిస్తున్నాయి.
జనవరి 14న కరోనా వైరస్ మనిషినుండి మనిషికి సంక్రమి స్తుందనే దానికి స్పష్టమైన ఆధారాలు లేవని డబ్ల్యూహెచ్ఓ ప్రకటన చేసింది.
అంతర్జాతీయ ప్రయాణాలపై ఫిబ్రవరి మాసంలోను నిషేధం అవసరం లేదని టెడ్రోస్ ప్రకటించారు.
పరిస్థితి విషమించిన తర్వాత మార్చి 11న కరోనా వైరస్ను ప్రపంచ మహమ్మారిగా ప్రకటించడం మొదలగు కారణాలతో ప్రపంచ ఆరోగ్యసంస్థ చైనా పట్ల సానుకూల దృక్పథాన్ని అవలంభిస్తున్నట్లు విమర్శల పాలయ్యింది.
డబ్ల్యూహెచ్ఒ తీసుకున్న నిర్ణయాలు, ప్రపంచ దేశాలను అప్రమత్తం చేసిన తీరు తదితర అంశాలపై విచారణకు సిద్ధంగా ఉన్నట్లు టెడ్రోస్ ప్రకటించారు.
ప్రపంచంలో మహమ్మారులు ప్రబలినపుడు ప్రపంచ ఆరోగ్య సంస్థ పేషెంట్ జీరోను కనుగొంటుంది.
ఇది ఆ వ్యాధిపై చేసే పరిశోధనల్లో ప్రాధాన్యత వహిస్తుంది. కాని కొవిడ్-19 విషయంలో కరోనా వైరస్ పేషెంట్ జీరోగా వ్ఞహాన్ సీఫుడ్ మార్కెట్లో రొయ్యలు అమ్మే మహిళను పేర్కొంటున్నారు.
కానీ ఇప్పటికీ జీవించి ఉన్న ఆ మహిళకు వైరస్ ఎలాసోకిందో మాత్రం చెప్పలేకపోతున్నారు. వైరస్లపై పరిశోధనలు చేసేందుకు వ్ఞహాన్లో పి4 స్థాయి పరిశోధనలు చేస్తున్నట్లు తెలిసింది/
దీనిలో అత్యంత ప్రమాదకరమైన వైరస్లు ఉన్నట్లు ఆరోపణలు వస్తున్నాయి.
2018 జనవరిలో పి4 ల్యాబ్ను సందర్శించిన అమెరికా నిపుణులు అక్కడి లోపాలనుగమనించి తమ దేశానికి సమాచారం అందించారనే వార్తను వాషింగ్టన్ పోస్ట్ ప్రచురించింది.
2008లో నోబెల్ విజేత ప్రముఖ వైరాలజిస్టులచే మౌంటెనియర్ కరోనా వైరస్ వ్ఞహాన్ ప్రయోగశాల నుంచే లీకయిందని ప్రకటించారు.
కరోనా వైరస్పై స్వతంత్ర దర్యాప్తు జరుగనున్న పరిస్థితులలో నిజాలు నిగ్గుతేలేందుకు, చైనా దీనికి పూర్తిగా సహకరించి తనపై పడ్డ నిందారోపణలు తుడిచేసుకోవాలి.
తక్షణమే అమెరికా కూడా తన ఆరోపణలు నిలిపివేసి దర్యాప్తులో డబ్ల్యూహెచ్ఒకు సహకరించి కరోనా గుట్టు తేల్చాలి. తద్వారా మానవాళికి ఉపయోగకరంగా ఉంటుంది.
- బిల్లిపెల్లి లక్ష్మారెడ్డి
తాజా క్రీడా వార్తల కోసం: https://www.vaartha.com/news/sports/