పిల్లలతో వెళ్లి రాజ్యసభకు నామినేషన్ దాఖలు చేసిన సోనియా గాంధీ
జైపూర్: ఈరోజు రాజ్యసభకు కాంగ్రెస్ పార్టీ నేత సోనియా గాంధీ నామినేషన్ దాఖలు చేశారు. రాజస్థాన్ నుంచి ఆమె తన నామినేషన్ ఫైల్ చేశారు. నామినేషన్ దాఖలు చేస్తున్న సమయంలో రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీ వద్రా, అశోక్ గెహ్లాట్, గోవింద సింగ్ దోస్తాలు ఉన్నారు. రాయ్బరేలి నుంచి ఎంపీగా ఐదు పర్యాయాలు ప్రాతినిథ్యం వహించిన సోనియా గాంధీ తొలిసారి రాజ్యసభ పోటీలో నిలుస్తున్నారు. కాంగ్రెస్ అధ్యక్షురాలిగా బాధ్యతలు స్వీకరించాక 1999లో తొలిసారి సోనియా ఎంపీగా ఎన్నికయ్యారు. రాజస్థాన్లో ఎన్నికలు జరుగనున్న మూడు రాజ్యసభ స్థానాల్లో ఒకదానిని కాంగ్రెస్ సునాయసంగా కైవసం చేసుకోగలదు.