దురంతో ఎక్స్‌ప్రెస్‌ రైలులో పొగలు..భయాందోళనలో ప్రయాణికులు

Smoke on Howrah-Delhi Duronto Express In Durgapur Triggers Panic

న్యూఢిల్లీః దురంతో ఎక్స్‌ప్రెస్‌ రైలులో పొగలు వ్యాపించాయి. ఈ రైలు హౌరా నుంచి ఢిల్లీ వైపు వెళ్తోంది. దుర్గాపూర్‌లోని రాజ్‌బంద్‌ రైల్వే స్టేషన్‌ సమీపంలోకి రాగానే ఒక్కసారిగా పొగలు వచ్చాయి. దీంతో ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. వెంటనే రైలు కిందకు దిగేశారు. ఘటనతో అప్రమత్తమైన రైల్వే అధికారులు పొగలను అదుపులోకి తెచ్చారు. అనంతరం కాసేపటి తర్వాత రైలు తిరిగి అక్కడి నుంచి బయలుదేరి వెళ్లింది. కాగా, ఈ ప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు. రైల్వే అధికారులు ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు.