లాస్య నందిత భౌతికకాయానికి కెసిఆర్‌ నివాళులు

KCR pays tribute to Lasya Nanditha body

హైదరాబాద్‌ః సికింద్రాబాద్​లోని లాస్య నందిత భౌతికకాయానికి బిఆర్​ఎస్​ అధినేత కెసిఆర్​ నివాళులు అర్పించారు. అనంతరం లాస్య నందిత మాతృమూర్తి, మాజీ ఎమ్మెల్యే సాయన్న సతీమణిని, ఇతర కుటుంబసభ్యులను కెసిఆర్ పరామర్శించారు. హైదరాబాద్​లోని లాస్య నందిత భౌతికకాయానికి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, హరీశ్​రావు, సబితా ఇంద్రారెడ్డి, కేశవరావు, కడియం శ్రీహరి, పల్లా రాజేశ్వర్​రెడ్డి నివాళులు అర్పించారు. అధికార లాంఛనాలతో లాస్య నందిత అంత్యక్రియలు ఏర్పాట్లపై హైదరాబాద్​ కలెక్టర్​కు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.

కార్ఖానాలో నివాసానికి లాస్య నందిత భౌతిక కాయం చేరుకుంది. లాస్యనందిత భౌతికకాయం వెంట హరీశ్‌రావు, తలసాని, పల్లా ఉన్నారు. లాస్య నందిత నివాసానికి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేరుకున్నారు. అధికార లాంఛనాలతో లాస్య నందిత అంత్యక్రియలు నిర్వహిస్తామని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. లాస్య నందిత అంత్యక్రియలు అధికార లాంఛనాలతో నిర్వహించాలని సీఎం రేవంత్​ రెడ్డి ఆదేశించారన్నారు. లారీ ఢీకొట్టిన తర్వాత రెయిలింగ్​కు తగిదిందని ఏసీపీ చెప్పారన్నారు. సీట్​ బెల్ట్​ పెట్టుకోలేదని ఏసీపీ తెలిపారని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు.