సీతారామం నుండి డిలీట్ సీన్ విడుదల

Sita Ramam Deleted Scene

సీతారామం నుండి డిలీట్ సీన్ ను విడుదల చేసి ఫ్యాన్స్ ను ఆకట్టుకున్నారు. మహానటి ఫేమ్ దుల్కర్ సల్మాన్ హీరోగా మృణాల్ ఠాకూర్, రష్మిక హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘సీతారామం’. సుమంత్, డైరెక్టర్‌ గౌతమ్‌ మీనన్, తరుణ్‌ భాస్కర్‌, మురళి శర్మ, వెన్నెల కిశోర్‌ తదితరులు కీలకపాత్రలు పోషించగా.. హను రాఘవపూడి డైరెక్ట్ చేసాడు. ఈ సినిమాను వైజయంతీ మూవీస్ సమర్పణలో అశ్వినీదత్‌ నిర్మించారు. భారీ అంచనాల నడుమ ఈ మూవీ ఆగస్టు 5న తెలుగు తో పాటు పలు భాషల్లో ప్రేక్షకుల ముందుకు వచ్చి సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది. ఈ నెల 09 నుండి అమెజాన్ లో స్ట్రీమింగ్ కాబోతుంది.

ఈ క్రమంలో సీతారామం నుండి డిలీట్ సీన్ ను మేకర్స్ విడుదల చేసారు.ఆ సీన్ చూసి ఆడియన్స్ ఫిదా అవుతున్నారు. సీతా మహాలక్ష్మి కోసం వెతుకుతున్న క్రమంలో రష్మిక మందన ప్యాలెస్ వద్దకు వస్తుంది. అక్కడ తన బ్యాగ్ మిస్ అయిందని తిరిగి తను వచ్చిన క్యాబ్ వద్దకు వస్తుంది. అప్పటికి క్యాబ్ డ్రైవర్ వెయిట్ చేస్తుండగా, తాను వెనక్కు వచ్చే వరకు ఎందుకు వెయిట్ చేశావ్? అని రష్మిక అడుగుతుంది. ఇంకా ఇండియాలో ఇలాంటి వాళ్లున్నారా? అని అంటుంది. అప్పుడు క్యాబ్ డ్రైవర్ మాట్లాడుతూ..ఇండియాలో అందరూ తన లాగే ఉంటారని, బ్యాగ్ తీసుకుపోయి తన దేశం పరువు పంపలేను మేడమ్ అని బదులు చెప్తాడు. ఆ డైలాగ్ విన్న సినీ ప్రియులు వావ్..ఇంత చక్కటి సీన్ ను ఎందుకు డిలీట్ చేశారు? ఇది సినిమాలో ఉంటే బాగుండేదని అభిప్రాయపడుతున్నారు.

YouTube video