‘ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం’ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు చీఫ్ గెస్ట్ గా విశ్వక్

అల్లరి నరేష్ హీరోగా తెరకెక్కుతున్న ‘ఇట్లు మారేడుపల్లి ప్రజానీకం’ మూవీ ప్రీ రిలీజ్ వేడుక ఈరోజు సాయంత్రం హైదరాబాద్ లోని ‘పార్క్ హయత్’ లో జరగబోతుంది. సాయంత్రం 6 గంటల నుంచి ప్రారంభం కానున్న ఈ వేడుకకు ముఖ్య అతిధులుగా యంగ్ హీరో విశ్వక్ సేన్ తో పాటు హీరో శ్రీ విష్ణు హాజరు కాబోతున్నారు. గత కొంతకాలంగా సరైన హిట్స్ లేని అల్లరి నరేష్ కు నాంది మూవీ సూపర్ హిట్ అయ్యి..నరేష్ సినీ కెరియర్ కు ఊపిరి పోసింది. విజ‌య్ క‌న‌క‌మేడ‌ల డైరెక్షన్లో విడుదలైన ఈ మూవీ కమర్షియల్ గా మంచి విజయం సాధించి..నరేష్ లోని మరో కోణాన్ని బయటపెట్టింది. ప్రస్తుతం మళ్లీ వరుస సినిమాలతో బిజీ గా ఉన్న నరేష్..’ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం’ అనే మూవీ తో నవంబరు 25న ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఇప్పటికే సినిమాలోని సాంగ్స్ , టీజర్ , ట్రైలర్ సినిమా ఫై అంచనాలు పెంచాయి.

మారేడుమిల్లి ఫారెస్టు నేపథ్యంలో సాగే ఈ చిత్రాన్ని హాస్య మూవీస్ – జీ స్టూడియోస్ వారు నిర్మిస్తుండగా, ఏ ఆర్ మోహన్ దర్శకత్వం వహించాడు. ఈ మూవీ లో అల్లరి నరేశ్ గవర్నమెంట్ ఆఫీసర్‌గా ఈ మూవీలో కనించబోతుండగా.. ఎలక్షన్ బ్యాక్‌డ్రాప్‌తో గిరిజనులు, వారి కష్టాలపై అల్లుకున్న కథగా కనిపిస్తోంది. ఈ సినిమాలో అల్లరి నరేశ్ జోడీగా ఆనంది అలరించనుంది. ‘జాంబీ రెడ్డి’ .. ‘శ్రీదేవి సోడా సెంటర్’ సినిమాల ద్వారా ప్రేక్షకులను ఆకట్టుకున్న ఆమె ఈ సినిమాలో సందడి చేయనుంది. వెన్నెల కిశోర్ .. చమ్మక్ చంద్ర ఈ సినిమాలో ముఖ్యమైన పాత్రలను పోషించారు. శ్రీచరణ్ పాకాల ఈ సినిమాకి సంగీతాన్ని అందిస్తున్నాడు.