ప్రముఖ సింగర్ కన్నుమూత..
ప్రముఖ సింగర్ భూపీందర్ సింగ్ (82) కన్నుమూశారు. గత కొంతకాలంగా చిత్రసీమలో వరుస విషాదాలు చోటుచేసుకుంటూ వస్తున్నాయి. ఎవరో ఒకరు ఏదొకరకంగా మరణిస్తూ వస్తున్నారు. తాజాగా సోమవారం భూపీందర్ సింగ్ తుదిశ్వాస విడిచారు. గత కొంత కాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. కోలన్ క్యాన్సర్తో పాటు కోవిడ్ తర్వాత వచ్చిన ఆరోగ్యపరమైన ఇబ్బందుల కారణంగా ఆయన చికిత్స తీసుకుంటున్నారు. సోమవారం పరిస్థితి విషమించటంతో కన్నుమూశారు.
ఐదు దశాబ్దాల పాటు సినీ కెరీర్లో భూపిందర్ సింగ్ ఎన్నో సినిమాలకు గాత్రదానం చేశారు. బాలీవుడ్ దిగ్గజ సంగీత దర్శకులతో ఆయన కలిసి పని చేశారు. ఆర్డీ బర్మన్, లతతా మంగేష్కర్, మహమ్మద్ రఫీ, ఆశా భోస్లే, బప్పి లహిరి వంటి ప్రముఖులతో కలిసి పని చేశారు. పంజాబ్లో దల్ డూండ్తా హై, నామ్ గమ్ జాయేగా, ఏక్ అకేలా ఇస్ షెహెర్ మే, కిసి నజర్ కో తేరా ఇంతెజార్ ఆజ్ భీ హై వంటి ఫేమస్ సాంగ్లు పాడారు. భూపేందర్ సింగ్ మరణంతో బాలీవుడ్ ప్రముఖులు దిగ్భ్రాంతికి లోనయ్యారు. ఆయన మృతిపట్ల పలువురు సంతాపం తెలుపుతున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ కూడా భూపిందర్ సింగ్ మృతిపట్ల ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు.