బాలీవుడ్ లో మరో విషాదం : జిమ్‌లో వ‌ర్క‌వుట్స్ చేస్తూ గుండెపోటుతో న‌టుడు మృతి

బాలీవుడ్ ఇండస్ట్రీ లో విషాదం చోటుచేసుకుంది. జిమ్‌లో వ‌ర్క‌వుట్స్ చేస్తూ గుండెపోటుతో యువ నటుడు సిద్ధాంత్ సూర్య‌వంశీ కన్నుమూశారు. కుసుమ్ వారిస్, సూర్య పుత్ర్ కర్ణ సీరియల్స్‌తో బాగా పాపులర్ అయినా సిద్దాంత్ వీర్ సూర్యవంశీ (46) శుక్రవారం సాయంత్రం కన్నుమూశారు. జిమ్‌లో వర్కౌట్లు చేస్తూ ఒక్కసారిగా కుప్పకూలిపోయినట్టు తెలుస్తోంది. జిమ్‌లో ఇలా చెమటోడ్చుతున్న సమయంలోనే హార్ట్ ఎటాక్ రావడంతో తుది శ్వాస విడిచారు. ఇలా కుర్ర హీరోలంతా కూడా జిమ్‌లో కష్టపడుతూనే కుప్పకూలిపోతోన్నారు. సిద్దార్థ్ శుక్లా, పునీత్ రాజ్ కుమార్ ఇలా ఎంతో మంది జిమ్‌లో వర్కవుట్లు చేస్తూనే మరణించిన సంగతి తెలిసిందే.

సిద్ధాంత్ సూర్య‌వంశీకి భార్య‌, ఇద్ద‌రు పిల్ల‌లున్నారు. సిద్ధాంత్ అస‌లు పేరు ఆనంద్‌. న‌టుడిగా కెరీర్‌ను ప్రారంభింంచిన త‌ర్వాత సిద్ధాంత్ సూర్య‌వంశీ గా మార్చుకునారు. క్యో రిస్తో మే క‌ట్టి బ‌ట్టి అనే షోలో చివ‌ర‌గా ఆయ‌న క‌నిపించారు. జిమ్‌లో వ‌ర్క‌వుట్ చేస్తూ సిద్ధాంత్ చ‌నిపోయాడ‌నే వార్త తెలియ‌గానే యావ‌త్ సినీ ఇండ‌స్ట్రీ షాకైంది. ఆయ‌న కుటుంబ స‌భ్యుల‌కు సానుభూతిని వ్య‌క్తం చేస్తున్నారు. సిద్దాంత్ పర్సనల్ లైఫ్ కూడా కాంట్రవర్సీగానే ఉంటుంది. ఇరాతో అతనికి 2015లో విడాకులయ్యాయి. ఇరా సిద్దాంత్‌లకు ఓ పాప జన్మించింది. ఆ తరువాత 2017లో అలీసియాను పెళ్లి చేసుకున్నాడు. అలీసియా సిద్దాంత్‌లకు ఓ బాబు పుట్టాడు. ఇప్పుడు సిద్దాంత్ మరణ వార్తతో బాలీవుడ్ బుల్లితెర దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తోంది. ఇలా మితిమీరిన వ్యాయామం, ఓ క్రమ పద్దతి లేని వర్కౌట్లు ప్రాణాంతకంగా మారుతోన్నాయి.